Skip to main content

Posts

dasamahavidya-kalimahavidya-poojanilayam

  #మహాశక్తివంతమైన #కాళీ #మంత్ర# సాధన    కాళీ సాధన వల్ల ఏమి జరుగుతుంది? ఒక్క మాటలో చెప్పాలంటే అసాధ్యాలు సాధించ వచ్చు. లోకంలో ఇది అసాధ్యం, చస్తే జరుగదు అనుకున్న పనులు కాళీ మాత అనుగ్రహం ఉంటే చిటికెలో జరుగుతాయి. ఇదెట్లా సాధ్యం అవుతుంది? కాళీ అనుగ్రహంతో కాల గతి త్వరితం అవుతుంది. కర్మ పరిపక్వత త్వరగా అవుతుంది. చెడు కర్మ భస్మం అవుతుంది. అనేక జన్మల కర్మానుభవం ఒక్క జన్మలో జరుగుతుంది.మహా కాళీ శక్తి కి ఎదురు నిలిచే శక్తి ప్రపంచంలో లేదు. ఆ శక్తియే ప్రసన్నురాలైనపుడు ఇక మానవుడు సాధించలేనిదంటూ ఉండదు. మరిన్ని సాధనాలు కొరకు poojanilayam పేజీ ని చూడండి వ్యక్తిగత సాధనాలు కొరకు Poojanilayam పేజీ లో మెసేజ్ చేయండి దశమహావిధ్య మంత్ర, స్త్రోత్ర సాధనాలు ఒక్కోటికి పెడతాను  ఈ దశమహావిద్యలలో మొదటి విద్య అయిన కాళీ  సాధన సకల రోగాల నుంచి, బాధల నుంచి విముక్తి శత్రునాశనం, దీర్గాయువు. సకలలోకలలో పూజత్వం , రాజ్యాధికారం , ఐశ్వర్యం,వాక్సుద్ధి , సాధకుడికి లభిస్తుంది. ఈ మంత్రం 41 రోజులు రోజుకి ఉదయం  3 మాలలు సాయంత్రం మూడు మాలలు ,3 మాలలు అనగా 324  సార్లు నిష్ఠగా సూచి గా సాత్విక ఆహారం మానసిక నిష్...

dasamahavidya-sadhana-poojanilayam

                                                           dasamahavidya-sadhana-poojanilayam #దశమహావిద్య #అమ్మవారుల #అనుగ్రహమునకు  #దశమహావిద్య #కవచ #సాధన మరిన్ని సాధనాలు కొరకు poojanilayam పేజీ ని చూడండి వ్యక్తిగత సాధనాలు కొరకు Poojanilayam పేజీ లో మెసేజ్ చేయండి దశమహావిధ్య మంత్ర, స్త్రోత్ర సాధనాలు ఒక్కోటికి పెడతాను,  మనం పొందే ఫలితాలు మనం చేసే సాధన తీవ్రత ని బట్టి ఉంటాయి  కృష్ణవర్ణంతో ప్రకాశించే శ్రీ కాళీదేవి దశమహావిద్యలలో మొదటి మహావిద్య, | కాలస్వరూపిణిగా ఖ్యాతిపొందిన శ్రీకాళీదేవి ఉపాసన ఎంతో ఉత్కృష్టమైనదిగా |  శ్రీకాళీ మహావిద్యని ఆరాధిస్తే సకల రోగాల నుంచి, బాధలనుంచి విముక్తి, ||శత్రునాశనం, దీర్ఘాయువు, సకలలోక పూజత్వం సాధకుడికి లభిస్తుంది. దశమహావిద్యలలో రెండవమహావిద్య శ్రీతారాదేవి. నీలవర్ణంతో భాసించే  శ్రీతారాదేవి వాక్కుకి అధిదేవత. ఈమెనే నీలసరస్వతి అనికూడా అంటారు. తారాదేవి సాధనవల్ల వాక్సిద్ధి, శత్రునాశనం, దివ్యజ్ఞాన...

అతిశక్తివంతమైన పరబ్రహ్మ గోపాల మహాసుదర్శన మాలమంత్ర సాధన

 అతిశక్తివంతమైన పరబ్రహ్మ గోపాల మహాసుదర్శన మాలమంత్ర సాధన (సర్వాభీష్ట సిద్ధికర సర్వారిష్ట నివారక, కాలసర్పదోషనివారణ కోరుకు ,)  ఈ సాధన వలన కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి సకల బాధలు కష్టములు తొలగించి సర్వ సుఖములు ప్రాప్తిస్తుంది ఉపాసనా క్రమము : ఈ సర్వారిష్ట నివారకము సర్వాభీష్ట సిద్ధికరమగు పరబ్రహ్మ గోపాల సుదర్శన మాలామంత్రము కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి. అనుష్టించదలచిన ఉపాసనాపరుడు శుచిగా, నియమ నిష్టలు ఆచరిస్తూ గృహమున లేక విష్ణు / నారసింహ లేక శ్రీకృష్ణ మందిర మునగాని నిత్యము ఉదయము 108సార్లు, సాయంత్రము 108 సార్లు వంతున  70 రోజులు అనుష్టించిన మాలామంత్రము సిద్ధియగును మండలము (70) రోజులు పూర్తియైన తదుపరి రోజు  71వరోజున మహావిష్ణు లేక శ్రీకృష్ణ లేక లక్ష్మీనారసింహ లేక శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంభూ క్షేత్ర దర్శనము. నిద్రగావించిన మాలామంత్ర సిద్ధి, శుద్ధి యగుటేగాక తనను ఆవరించి బాధించుచున్న బాధలు నిర్వీర్యమగును. ఒకవేళ భయంకరమైన  ఇతర క్షుద్ర దేవతల ప్రయోగాలు చే బాధపడిన యెడల  ఉపాసనాపరుడు రెండుమండలములు (96రోజులు) కనీసము ధ్యానించి ఆ తదుపరి హోమాదులు, స్వయంభూ క్షేత్ర దేవ...

జాతకం - రోగాకరక గ్రహములు - పరిహారాలు - ధన్వంతరి మంత్రం

 జన్మ జాతక చక్రం లో  రోగకారక గ్రహాలు కోసం వివరణ -మరియు ఆ గ్రహములు దోషములు యొక్క తీవ్రత ని దోషములు ని తాగించడానికి తాంత్రిక పరిహారాలు మరియు జాతక చక్రం లో రోగ కారక , పీడిత గ్రహాలు వలన వచ్చే రోగాలు కి మానసిక రుగ్మతలకి సర్వరోగాలు నివారించే సంజీవని లాంటి మహా శక్తివంతమైన ధన్వంతరీ మంత్రం   మానవుల ఆరోగ్యాలపై ప్రభావం చూపించే గ్రహాలలో చంద్ర, కుజ, శని గ్రహాలు ప్రధానమైనవిగా చెప్పాలి. కుజ గ్రహం భూమికి చాలా దగ్గరగా ఉంటుంది అందువల్ల ఆ గ్రహ ప్రభావం మానవుల మీద చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పక తప్పదు జ్యోతిషశాస్త్ర సిద్ధాంతాల ప్రకారం చూసినట్లయితే మనిషి శరీరం 12 భాగాలుగా విభజించబడి ఉంటుంది. అంతరిక్షంలో ఉండే 12 రాశులకి ఈ 12 శరీర భాగాలతో ప్రత్యేక సంబంధం ఉంటుంది. ఈ రాశులకు అధిపతిగా ఉండే గ్రహాలు మానవుని శరీరంలోని 12 భాగాలు మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఒక వ్యక్తి జాతక చక్రంలో ఒక స్థానం (అనగా రాశి)లో ఉండే గ్రహం అశు భస్థితిలో ఉన్నట్లయితే ఆ రాశికి సంబంధించిన ఆ వ్యక్తి శరీర భాగంలో వ్యాధులు ఏర్పడతాయి పుట్టిన ప్రతి జీవికీ ఏదో ఒక విధమైన అనారోగ్యం తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో వచ్చి తీరుతుంది. మనిషి విషయ...

మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం

 మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం  గండభేరుండ నరసింహ సాధన సాధన :-  రోజుకి 324 సార్లు 41 రోజులు చేయండి  శ్రద్ద ,మానసిక నిష్ఠ, తో చేయండి   గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి అతిరహస్యము మరియు అత్యంత శక్తివంతము అయిన గండభేరుండ నరసింహ సాధన :- గండభేరుండ నరసింహ ఎనిమిది శిరస్సులతో ఉంటాడు. ఆ శిరస్సులు ఏమిటీ అంటే... 1.గండభేరుండ పక్షిరాజు : స్వామి ఈ శిరస్సుతో శరభేశ్వరుడిని మరియు అతని భార్యలు- యుద్ధంలో ఓడించాడు. ఈ ముఖాన్ని తత్సబంధిత మంత్రంతో ఆరాధించినట్లయితే అభిచార ప్రయోగాలు (చేతబడులు) మరియు క్షుద్రశక్తుల వలన కలిగే పీడలు దహనం అయిపోతాయి 2.నరసింహ మృగరాజు : శరభేశ్వరునికి సంబంధించిన వీరభద్రుడు, అఘోరా మరియు ఇతర అస్త్రమూర్తులను ఈ శిరస్సు లొంగదీసింది. ఈ శిరస్సును తత్సంబం...

అతిశక్తివంతమైన హనుమా బీజ మంత్రసంపుటీ కరణ స్త్రోత్రం తో పాటు హనుమంతుడి ఉపాసనా రహస్యాలు - poojanilayam

అతిశక్తివంతమైన హనుమా బీజ మంత్రసంపుటీ కరణ  స్త్రోత్రం  తో పాటు హనుమంతుడి  ఉపాసనా రహస్యాలు మరియు హనుమాన్ 9 అవతారాలు  అయిన 1 ప్రసన్నాంజనేయం 2. వీరాంజనేయుడు 3. వింశతి భుజాంజనేయుడు పంచముఖ ఆంజనేయుడు 5. అష్టాదశభుజ ఆంజనేయుడు 6. సువర్చలా సహిత ఆంజనేయుడు 7. ద్వాత్రింశద్భుజాంజనేయుడు 8. చతుర్భుజ ఆంజనేయుడు 9. వామనాకార ఆంజనేయుడు కోసం వివరణ సాధన :- రోజుకి 9 సార్లు 41 రోజులు అద్బుతమైన ఫలితం వస్తుంది హనుమా అనుగ్రము కలుగుతుంది హైందవులకు ముఖ్యమైన దైవములలో ఆంజనేయస్వామి కూడా ఒకరు. భవిష్య బ్రహ్మ అయిన ఈ పవనపుత్రుడు పిలిచినవారికి పలికే ప్రత్యక్ష దైవం అనటంలో సందేహం ఎంతమాత్రం లేదు. భూత, ప్రేత, పిశాచ, శాకినీ, ఢాకినీ, గాలి, దయ్యాలను పారద్రోలటంలో మారుతీకి ఉన్న మహత్తు మరెవ్వరికీ లేదు అనటంలో అతిశయోక్తి లేదు. తంత్రశాస్త్రంలో హనుమకు ఉన్న ప్రాధాన్యత ఇంతా అంతాకాదు. క్షుద్ర ప్రయోగాలను తిప్పి కొట్టటంకోసం చేసే పూజలలో చేసే అష్టదిగ్బంధనములోని అష్టశక్తులలో ఆంజనేయుడు ఒకరు అని గ్రహించాలి. అతిశక్తివంతము, నిగూఢము అయిన ఆంజనేయ త్వాన్ని అర్థం చేసుకోవడం సామాన్యులకు సాధ్యం కాదు అపర రుద్రుడయిన హనుమకు 5 అన...

జన్మకుండలినిలో ఏకాదశ నక్షత్రములు గురించి రహస్యాలు - poojanilayam

జన్మకుండలినిలో ఏకాదశ నక్షత్రములు గురించి రహస్యాలు 1) కర్మ నక్షత్రం 2) సాముదాయిక నక్షత్రం 3)సంఘాటిక నక్షత్రం 4)జాతక నక్షత్రం 5)నైధన నక్షత్రం 6)దేశ నక్షత్రము 7)అభిషేక నక్షత్రం 8)అధాన నక్షత్రం 9) వినాశ నక్షత్రం 10)మానస నక్షత్రం 11)దేశ నక్షత్రం" మానవుడు యొక్క కర్మ ఫలితాలు  నక్షత్రలలో ఎలా పొందుపరిచి ఉంటాయి జ్యోతిషంలో జన్మనక్షత్రం ప్రాధాన్యత ఏమిటి , హిందూ జ్యోతిష విధానంలో ఉపయోగించే 27 నక్షత్ర మండలాలను 27 నక్షత్రాలుగా గుర్తించాడు. ఈ 27 నక్షత్రాలు భూమికి 400 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది. ఒక బిడ్డ పుట్టిన సమయంలో చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో తెలుసుకుని ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును తెలియజేసే శక్తిని హిందూ జ్యోతిషశాస్త్రం కలిగి యూజ్ఉన్నది నక్షత్ర అనే సంస్కృత పదాన్ని విడగొట్టినట్లయితే "ఎక్స్(ఆకాశం), క్షేత్ర(ప్రదేశం) అనే రెండు పదాలుగా మారతాయి. కనుక నక్షత్రం అంటే "ఆకాశం ప్రాంతం" లేదా "Sky map" అని అర్ధంచేసుకోవాలి. ఇంకొక అర్థం ఏమిటంటే "నక్షత్ర ప్రాంతం" అని. ఈ రెండు అర్థాలు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ప్రాచీన మహర్షులు 27 నక్షత్రాలను ల...