Skip to main content

మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం

 మహాశక్తివంతమైన ఎనిమిది శిరస్సులతో ఉన్న గండభేరుండ నరసింహ మహామంత్రం 


గండభేరుండ నరసింహ సాధన


సాధన :-  రోజుకి 324 సార్లు 41 రోజులు చేయండి 

శ్రద్ద ,మానసిక నిష్ఠ, తో చేయండి

 

గురుముఖత గా తీసుకున్న మంత్రాలు ఇంకా ఎక్కువ ఫలితాలు ఇస్తాయి  శీఘ్రముగా గా ఫలితాలు ఇస్తాయి, గురువు లేని కుదరని పక్షం లో మేరు తంత్రాన్ని అనుసరించి  ఇలా చేయవచ్చు

చాలా శక్తి వంతమైన ఈ మూలమంత్రం ఆ శివుడునే గురువుగా భావించండి మంత్రం పేపర్ లో రాసి శివలింగం దగ్గర ఉంచి శివుడు ఉపదేశం ఇచ్చినట్టు భావించి మంత్రం జపం చేయండి


అతిరహస్యము మరియు అత్యంత శక్తివంతము అయిన గండభేరుండ నరసింహ సాధన :- గండభేరుండ నరసింహ ఎనిమిది శిరస్సులతో ఉంటాడు. ఆ శిరస్సులు ఏమిటీ అంటే...


1.గండభేరుండ పక్షిరాజు : స్వామి ఈ శిరస్సుతో శరభేశ్వరుడిని మరియు అతని భార్యలు- యుద్ధంలో ఓడించాడు. ఈ ముఖాన్ని తత్సబంధిత మంత్రంతో ఆరాధించినట్లయితే అభిచార ప్రయోగాలు (చేతబడులు) మరియు క్షుద్రశక్తుల వలన కలిగే పీడలు దహనం అయిపోతాయి


2.నరసింహ మృగరాజు : శరభేశ్వరునికి సంబంధించిన వీరభద్రుడు, అఘోరా మరియు ఇతర అస్త్రమూర్తులను ఈ శిరస్సు లొంగదీసింది. ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే సమస్త రోగాలు నిర్మూలించబడి మంచి ఆరోగ్యం లభిస్తుంది


3.మహావ్యాగ్ర: ఈ శిరస్సు శివ సంబంధమైన నంది, గణపతి మరియు ఇతర శివ దేవతలను శరభేశ్వరునితో సహా అణచివేసింది. ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే దేవతల నుంచి, దయ్యాల నుండి, ప్రకృతినుండి, మానవులనుండి లభించే అన్ని రకాల ప్రమాదాలు నివారించ బత్తాయి


4.హయగ్రీవ : ఈ శిరస్సును తత్ సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే అన్ని శాస్త్రాలలో నైపుణ్యం కలిగి బ్రహ్మజ్ఞానం లభిస్తుంది


5.ఆదివరాహ :- ఈ ముఖాన్ని తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే దారిద్ర్యం తొలగిపోతుంది. మంచిభార్య, పుత్రులు లభిస్తారు. ఊహించని సంపదలు ప్రసాదించబడతాయి


 6.అఘోరా వానరేంద్ర : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే మన గ్రహ బాధలు తొలగిపోయి షట్కర్మ ప్రయోగంలో (అభిచార ప్రక్రియలు)

మంచి నైపుణ్యం లభిస్తుంది


7.మహా గరుడ : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే నాగ దోషం, నాగ భయం, విషభయం, పితృదోషాలు నివారణ అవుతాయి


8.భల్లూక : ఈ శిరస్సును తత్సంబంధిత మంత్రంతో ఆరాధిస్తే షోడశ అనగా 16 సిద్ధులు లభిస్తాయి


అయితే గండభేరుండ నరసింహునికి ఈ ఎనిమిది ముఖం కాకుండా గూఢమైన మరియు ఎవరికీ కనపడని తొమ్మిదవ ముఖం కూడా ఉన్నదని దానిని బడబానల ముఖమని పిలుస్తారు. ఆ ముఖం ఆదినారాయణునికి చెందియున్నది. ఎవరైతే మహావిష్ణువుకు అతి దగ్గర అవుతారో వారికి గండ భేరుండ నరసింహునికి చెందిన తొమ్మిదవ శిరస్సుకూడా కనిపిస్తుందని ఋషులు  తెలియజేస్తున్నారు


Popular posts from this blog

వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ: వివాహ పొంతన ఏలా చూడాలి ? అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ - marriage compatibility - Poojanilayam

 వివాహ పొంతన కోసం సంపూర్ణ వివరణ:  వివాహ పొంతన ఏలా చూడాలి ?  అష్ట గుణ కూటమి గురించి సంపూర్ణ వివరణ -  marriag e compatibility - Poojanilayam

అతిశక్తివంతమైన పరబ్రహ్మ గోపాల మహాసుదర్శన మాలమంత్ర సాధన

 అతిశక్తివంతమైన పరబ్రహ్మ గోపాల మహాసుదర్శన మాలమంత్ర సాధన (సర్వాభీష్ట సిద్ధికర సర్వారిష్ట నివారక, కాలసర్పదోషనివారణ కోరుకు ,)  ఈ సాధన వలన కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి సకల బాధలు కష్టములు తొలగించి సర్వ సుఖములు ప్రాప్తిస్తుంది ఉపాసనా క్రమము : ఈ సర్వారిష్ట నివారకము సర్వాభీష్ట సిద్ధికరమగు పరబ్రహ్మ గోపాల సుదర్శన మాలామంత్రము కోరిన కోర్కెలు తీర్చుటలో దీనికిదేసాటి. అనుష్టించదలచిన ఉపాసనాపరుడు శుచిగా, నియమ నిష్టలు ఆచరిస్తూ గృహమున లేక విష్ణు / నారసింహ లేక శ్రీకృష్ణ మందిర మునగాని నిత్యము ఉదయము 108సార్లు, సాయంత్రము 108 సార్లు వంతున  70 రోజులు అనుష్టించిన మాలామంత్రము సిద్ధియగును మండలము (70) రోజులు పూర్తియైన తదుపరి రోజు  71వరోజున మహావిష్ణు లేక శ్రీకృష్ణ లేక లక్ష్మీనారసింహ లేక శ్రీ వేంకటేశ్వరస్వామి స్వయంభూ క్షేత్ర దర్శనము. నిద్రగావించిన మాలామంత్ర సిద్ధి, శుద్ధి యగుటేగాక తనను ఆవరించి బాధించుచున్న బాధలు నిర్వీర్యమగును. ఒకవేళ భయంకరమైన  ఇతర క్షుద్ర దేవతల ప్రయోగాలు చే బాధపడిన యెడల  ఉపాసనాపరుడు రెండుమండలములు (96రోజులు) కనీసము ధ్యానించి ఆ తదుపరి హోమాదులు, స్వయంభూ క్షేత్ర దేవ...